Wednesday, October 22, 2025
spot_img

నకిలీ ఇన్సూరెన్స్‌ ముఠా అరెస్ట్‌

Must Read

శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నకిలీ ఇన్సూరెన్స్‌ లు తయారుచేస్తున్న ముఠా సభ్యులను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులు విస్తృతంగా నకిలీ ఇన్సూరెన్స్‌ పాలసీలు తయారుచేసి అవి సరైన ధృవీకరణ లేకుండా అమాయకులకు విక్రయించి, భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఓటి పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పలువురు వ్యక్తుల నుంచి అనుమానాస్పద ఫిర్యాదులు అందిన తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఓటీ పోలీసులు ముఠా సభ్యులను కస్టడీలోకి తీసుకుని, వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఈ ముఠా సభ్యులు నకిలీ ఇన్సూరెన్స్‌ పాలసీలను తయారు చేయడానికి ఆధునిక ప్రింటింగ్‌ మెషిన్లను ఉపయోగించి, ఉత్పత్తి చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలను కూడా తయారుచేసి, వాటిని నిజమైన ఇన్సూరెన్స్‌ సంస్థల పత్రాల మాదిరిగా రూపకల్పన చేశారు. ఆ తరువాత వీరు ఆ పత్రాలను వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ విక్రయించారు. ఆ క్రమంలో నకిలీ ఇన్సూరెన్స్‌ లను సేల్‌ చేసేందుకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు వారు డోర్‌ టూ డోర్‌ సర్వీసులను కూడా నిర్వహించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This