Friday, October 3, 2025
spot_img

“మిస్టర్ సెలెబ్రిటీ” నుండి ‘గజానన’ పాట విడుదల

Must Read

సుదర్శన్ పరుచూరి హీరోగా ” మిస్టర్ సెలెబ్రిటీ ” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్,శ్రీ దీక్ష,నాజర్,రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు.ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది.వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తి గల పాటను రిలీజ్ చేశారు. ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు.గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది.ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగిపోయేలా కనిపిస్తోంది.గజానన అంటూ సాగే ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది.తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు,చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This