Sunday, May 18, 2025
spot_img

“మిస్టర్ సెలెబ్రిటీ” నుండి ‘గజానన’ పాట విడుదల

Must Read

సుదర్శన్ పరుచూరి హీరోగా ” మిస్టర్ సెలెబ్రిటీ ” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్,శ్రీ దీక్ష,నాజర్,రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు.ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది.వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తి గల పాటను రిలీజ్ చేశారు. ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు.గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది.ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగిపోయేలా కనిపిస్తోంది.గజానన అంటూ సాగే ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది.తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు,చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS