Wednesday, July 23, 2025
spot_img

కృత్రిమ మేధతో ప్రభుత్వ పాలన

Must Read

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)తో పరిపాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అన్నిశాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. భూముల సర్వే, సెటిల్మెంట్లు, రెవెన్యూ, హౌజింగ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఇలా అన్ని విభాగాలను ఏఐ ద్వారానే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చేలా ఏఐని వాడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

అన్ని శాఖల్లోనూ ఏఐ ద్వారానే పనులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని పొంగులేటి అన్నారు. ఏఐ ఆధారిత పాలనను అందించేందుకు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం తాము స్వల్ప స్థాయిలోనే ఏఐని వినియోగిస్తున్నామని, చేయాల్సింది ఇంకా చాలా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

Latest News

‘హరిహర వీరమల్లు’: నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌కు సీబీఎఫ్‌సీ సభ్యులు అక్కల సుధాకర్ అభినందనలు

తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS