Monday, August 18, 2025
spot_img

భారతదేశం స్వచ్చత వైపు అడుగులు వేస్తోంది

Must Read

-ఏంపీ ఈటేల రాజేందర్‌

‘‘స్వచ్చత తాహి సేవా’’ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట బార్కాస్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వచ్చ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.మనం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం కాదు,మన పరిసరాలు,తోటి వారు కూడా ఆరోగ్యకరంగా ఉండాలని స్వచ్చత కార్యక్రమం సంకల్పం అని అన్నారు.ఆపరిశుభ్రత కారణంగా కరోన లాంటి రోగాలు జనాలకు భయభ్రాంతులకు గురిచేశాయని,కాని భారతదేశం కరోనా లాంటి వ్యాధులను సమర్దవంతంగా ఎదురుకుందాని పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌ సెక్టర్‌ ఏడీజీ.రవీ దీప్‌ సింగ్‌ సాయి,గ్రూప్‌ సెంటర్‌ డీఐజీపీ,ఉధయ్‌భాస్కర్‌ భల్లా,ఐపీఎస్‌తో పాటు ఇతర అధికారులు,జవాన్లు పాల్గొన్నారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS