Friday, October 3, 2025
spot_img

వయనాడ్ లో విరిగిపడ్డ కొండచరియలు,స్పందించిన ప్రధాని

Must Read

వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02 లక్షలు,గాయపడ్డ వారికి రూ.50 వేలు చెల్లిస్తారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు సుమారుగా 88 మంది మరణించారని,తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.తాజా ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం జులై 30,31న రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించి,ప్రభుత్వ కార్యక్రమాలను వాయిదా వేసుకుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This