విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసిన అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య
రంగారెడ్డి జిల్లా, మాజీద్పూర్లోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు అందజేసింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ పి. సుబ్బయ్య, కోశాధికారి లయన్ ఎల్. వేణుగోపాల్, జోన్ చైర్మన్ లయన్ ఇ. బుచ్చయ్య పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోన్ చైర్మన్ బుచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లైన్స్ క్లబ్, కలాం ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని, వారి విద్యా ప్రగతికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.