Monday, August 18, 2025
spot_img

మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు

Must Read

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.అదేవిధంగా కొన్ని షరతులు సైతం విధించింది.పాస్పోర్ట్ అప్పగించాలని,సాక్షులను ఏ మాత్రం ప్రభావితం చేయకూడదని తెలిపింది.గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.ఆ తర్వాత ఈడీ సైతం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది.అప్పటి నుండి సుమారుగా 17 నెలల పాటు అయిన జైలులోనే ఉన్నారు.తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మనీష్ సిసోడియా కోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.ఈరోజు సాయింత్రం మనీష్ సిసోడియా జైల్ నుండి విడుదలయ్యే అవకాశం ఉంది.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS