Monday, August 18, 2025
spot_img

జపాన్ ప్రజలను వెంటాడుతున్న కొత్త వైరస్

Must Read

మరో కొత్త వ్యాధి జపాన్ ప్రజలను వెంటాడుతుంది.స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధితో జపాన్ ప్రజలు సతమతమవుతున్నారు.ఈ వ్యాధి సోకితే 48 గంటల్లో మనిషి చనిపోతాడాని వైద్యులు పేర్కొన్నారు.జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 1000 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.మాంసాన్ని తినే బ్యాక్టిరియా వల్ల ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు,వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం ఈ వ్యాధి జపాన్ లో వేగంగా వ్యాపిస్తుంది.ఈ వైరస్ పై ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వైరస్ బారిన పడితే 48 గంటల్లోనే మరణిస్తారని,ఈ వ్యాధి సోకితే ఆ రోగి పాదంలో వాపు వస్తుందని,అది మోకాలి వరకు వ్యాపిస్తుందని తెలిపారు.ప్రజలు పరిశుభ్రత పాటించాలని,చిన్న గాయం తగిలిన చికిత్స చేయించుకోవాలని తెలిపారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS