Friday, October 3, 2025
spot_img

ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు

Must Read
  • సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు.ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన అయిన మీడియాతో మాట్లాడారు.దేశంలో రాజకీయాలు రోజురోజు దారుణంగా మారుతున్నాయని,నేతలు చట్టసభల్లో హుందాగా మాట్లాడాలని అన్నారు.రాజకీయలోకి వచ్చేవారు సిద్ధాంత పరమైన రాజకీయాలు చేయాలనీ,ప్రస్తుతం ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో,ఎప్పుడు పోతాడో తెలియడం లేదని వెల్లడించారు.యువత రాజకీయలోకి రావాలని కోరారు. తెలుగు వంటలు,వేషధారణ,వ్యవసాయం అంటే ఏంటో ఇష్టమని పేర్కొన్నారు.నూతనంగా చట్టసభలకు ఎన్నికైన యువత ఆ సభలకు గౌరవం తీసుకోని రావాలని,పార్టీ మారాలని అనుకునే వారు తమ పదవులకు రాజీనామా చేయాలనీ తెలిపారు.కులం,ధనం బట్టి ఓట్లు వెయ్యొద్దని,ఆ నాయకుడి ప్రవర్తన,గుణం చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని వెంకయ్య నాయుడు ఈ సందర్బంగా తెలిపారు.అనేకసార్లు తమ కుమారుడిని,కుమార్తెను రాజకీయల్లోకి రావాలని కోరినట్టు పేర్కొన్నారు.కానీ వారు తమ పనుల్లో బిజీ ఉన్నారని,ఎవరికీ ఇష్టమైన పనులను వారినే చేసుకోనివ్వాలని వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This