Sunday, May 18, 2025
spot_img

ఇదేమి రాజ్యం చంద్రబాబు, బద్వేల్ ఘటనపై స్పందించిన జగన్

Must Read

బద్వేల్‎లో ఇంటర్ విద్యార్థిని హత్యాచారం ఘటనపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో “లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు..ఇదేమి రాజ్యం చంద్రబాబు” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు. బద్వేలులో ఇంటర్‌ కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం ఉందని జగన్‌ విమర్శించారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆరోపించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS