Saturday, July 12, 2025
spot_img

ఓఆర్‌ఆర్‌పై టోల్‌ పెంపు

Must Read
  • మళ్లీ పెరిగిన టోల్‌చార్జీలు
  • నేటి నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
  • కారుకు రూ.2.44కు, బస్సులకు కి.మీ. రూ.7లు పెంపు

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ చార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ వెల్లడించింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను ఐఆర్‌బీ సంస్థ రెండేండ్ల క్రితం 30 ఏండ్ల కాలానికి లీజు తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5 శాతం వరకు టోల్‌ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్‌ ధరలను పెంచింది. దీని ప్రకారం కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచింది. దీంతో ప్రస్తుతం కిలోమీటర్‌కు రూ.2.34గా ఉన్న చార్జీలు రూ.2.44కు పెరిగాయి. అదేవిధంగా మినీబస్‌, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రూ.3.77 నుంచి రూ.3.94కు చేరింది. 2 యాక్సిల్‌ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచింది. భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుంచి రూ.15.78కు పెంచింది. ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1న టోల్‌చార్జీలను సంస్థ పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగా గతేడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్‌ నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా మరోసారి చార్జీలను పెంచింది.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS