Sunday, May 18, 2025
spot_img

ఆ దుశ్చర్యకి పాల్పడింది మేమే

Must Read

జమ్మూకాశ్మీర్ లో బస్సు పై తామే దాడికి పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.
ఆదివారం రియస్ లోని భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో పది మంది భక్తులు మృతిచెందారు.34 మంది భక్తులు గాయపడ్డారు.గాయపడిన భక్తులకు సమీపంలో ఉన్న ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బస్సు పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుండి పరారయ్యారు.వెంటనే రంగంలోకి దిగిన భద్రత బలగాలు ఉగ్రవాదుల కోసం కుంబింగ్ చేపట్టాయి.తాజగా ఈ దాడికి పాల్పడింది తామేనంటూ టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.గతంలో కూడా టీఆర్ఎఫ్ సంస్థ అనేక దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది.ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS