- ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గ*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు. ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలో గ*జాయి, డ్ర*గ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు. శనివారం మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కానిస్టేబుల్ అప్పారావు పై దాడి చేశాడు. ఈ దాడిలో అప్పారావు కి తీవ్ర గాయాలయ్యాయి.