Sunday, September 7, 2025
spot_img

హైదరాబాద్‎లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ఏ ఒక్కరోజు కూడా రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదని, అయిన ప్రతిభను చూసి పదవులే అయిన వద్దకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‎లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ సెంటర్‎లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోశయ్య నిబద్ధత వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఆవిష్కృతమైందని తెలిపారు. రోశయ్యలా సమస్యను పరిష్కరించే నాయకుడు తెలంగాణ శాసనసభలో లేరన్న లోటు కనిపిస్తుందని అన్నారు.పార్టీ కోసం రోశయ్య ఎంతో నిబద్ధతగా పనిచేశారని,ట్రబుల్ షూటర్ గా రోశయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు.

2007లో నేను శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నప్పుడు రోశయ్య నాకు కొన్ని సలహాలు,సూచనలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఇరిగేషన్ శాఖపై బాగా మాట్లాడుతున్నానని నన్ను ప్రోత్సహించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

రోశయ్య నిఖార్సైన హైదరాబాది..అయిన విగ్రహం హైదరాబాద్‎లో లేకపోవడం లోటే..తప్పకుండా హైదరాబాద్ లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This