Friday, September 20, 2024
spot_img

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం చారిత్రాత్మకమైన ఘట్టం

Must Read

మోడీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నని అన్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ.దేశ ప్రధానిగా ఈరోజు మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు.తనకు అందిన ఆహ్వానం పై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరుకావడం గౌరవంగా ఉందని, ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం అని తెలిపారు భారత్‌లో పర్యటించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడతాయి అని పేర్కొన్నారు.

ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్ లో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయున్నారు.మోడీతో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఇక వివిధ దేశాల నుండి అతిథులు,అధినేతలు,ప్రముఖులు వస్తుండడంతో ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This