Friday, September 20, 2024
spot_img

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్

Must Read

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశరక్షణే మా బాధ్యత అని అన్నారు.తన పై నమ్మకంతో మరోసారి రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.బలమైన ఆత్మనిర్భర్ భారత్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని తెలిపారు.ఇప్పటి వరకు రూ.21000 కోట్ల రూపాయలకు పైగా రక్షణ పరికరాలను ఎగుమతి చేశామని,దీనిని రూ.50,000 కోట్లకు తీసుకోని వెళ్లడమే తమ లక్ష్యమని ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This