Thursday, August 28, 2025
spot_img

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారు

Must Read
  • యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్
  • రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్
    లీకేజిలను అపలేకపోయారు
  • నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది
  • బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది

పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోడీ రష్యా-ఉక్రేయిన్ యుద్ధాన్ని అడ్డుకున్నారని చెప్తున్నారు కాని దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజిలను అపలేకపోయారని ఆరోపించారు.నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు.వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈ సంధర్బంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.నీట్ పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉందని,అందుకే లీకేజిలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

Latest News

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల బీభత్సం

300 మందికిపైగా ప్రాణాలు బలి హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల విరుచుకుపడటం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులతో పర్వత రాష్ట్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS