Friday, October 3, 2025
spot_img

షాద్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం,ఆరు మంది కార్మికులు మృతి

Must Read

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఓ గ్యాస్ ఫ్యాక్టరీలో ఫ‌ర్న‌స్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో మొత్తం ఆరు మంది కార్మికులు మృతిచెందారు.మరో 15 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.ఒక్కసారిగా పేలుడు సంభవించి దట్టమైన పొగలు అలుముకోవడంతో భయాందోళనకు గురైన స్థానికులు,కార్మికులు పరుగులు తీశారు.సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొనివచ్చారు.ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు.కార్మికులు అంతా ఇతర రాష్ట్రాలకి చెందిన వారాని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మందికి పైగా కార్మికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This