Friday, September 20, 2024
spot_img

యూపీలో తొక్కిసలాట,100 మందికి పైగా భక్తులు మృతి

Must Read

యూపీలో ఘోరం చోటుచేసుకుంది.మంగళవారం రతీభాన్‌పూర్‌లో పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.పెద్దసంఖ్యలో చిన్నారులు,మహిళలు గాయపడ్డారు.ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులు భయాందోళనకు గురై,పరుగులు తీశారు.ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.గాయపడిన వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నామని,మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.ఘటన జరిగిందని తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This