- హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుంది
- దౌర్జన్యాలపై హజ్రత్ ఇమామ్ పోరాటం చేశారు : కిషన్ రెడ్డి
మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.మొహరం సందర్బంగా ఓల్డ్ సిటీలోని అలాం పీర్లను సందర్శించారు.ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కిషన్ రెడ్డికి ముస్లింలు దట్టి కట్టారు.ఈ సందర్బంగా అయిన మీడియాతో మాట్లాడుతూ,ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమరస్యాన్ని,సమైక్యతను ప్రతిబింబిస్తాయని తెలిపారు.దుర్మార్గాలు,దౌర్జన్యాలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని ఈ సందర్బంగా స్మరించుకుంటున్నామని అన్నారు.సమాజంలోని సుఖసంతోషాల కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడవద్దని గుర్తుచేసే పండుగ అని వెల్లడించారు.మహమ్మద్ ఆశయసాధనకు అందరూ ముందుకు సాగాలని తెలిపారు.