Friday, September 5, 2025
spot_img

నాయకుల కాళ్లకు దండం పెట్టి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు

Must Read
  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక నుండి తాన కాళ్లకు ఎవరైనా దండం పెడితే, తిరిగి తాను కూడా వారి కాళ్లకు దండం పెడతానంటూ వ్యాఖ్యనించారు.శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,నాయకులు కాళ్లకు దండం పెట్టె సంస్కృతిని వీడాలని కోరారు.మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కాళ్ల తప్ప ఇంకెవరి కాళ్లకి దండం పెట్టాల్సిన అవసరం లేదని స్పస్టం చేశారు.నాయకులకు దండాలు పెట్టి ఎవరు కూడా తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు.ఇక నుండి నాయకులకు దండం పెట్టొద్దన్న సంప్రదాయాన్ని తాన నుండే మొదలు కావాలని తెలిపారు.ఇప్పటి నుండి తాను కూడా ఈ సంస్కృతిని పాటిస్తానని అన్నారు.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This