Friday, September 20, 2024
spot_img

బీజేపీతో కూడా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

Must Read
  • బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పై బీజేఎల్పీ నేత,నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేస్తూ,బెదిరించి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని విమర్శించారు.బీజేపీతో కూడా చాల మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అన్నారు.తెలంగాణలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని కీలక వ్యాఖ్యలు చేశారు.ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలనే నిబంధన ఉండడంతో చాల మంది వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు.ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.ఇచ్చిన ఒక్క హామీను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు.ప్రజా పాలనా,ప్రజా దర్భార్ కానరాకుండా పోయిందని అన్నారు.రాష్ట్రంలో ప్రజా పాలనా పేరు మీద రాక్షస పాలనా కొనసాగుంతుందని ధ్వజమెత్తారు.ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనా పై రానున్న రోజుల్లో బీజేపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This