Friday, September 20, 2024
spot_img

ప్రభుత్వం పై బురద చల్లాడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు

Must Read

రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బురద చల్లాడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,అధికారం కోల్పోయిన మూడు నెలలకే జగన్ కు మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరుగుతే,ఈ హత్యల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మరణించారని తెలిపారు.కాని ప్రభుత్వం పై బురద చల్లాడానికి 36 రాజకీయ హత్యలు జరిగినట్టు జగన్ ఆరోపిస్తున్నారని వెల్లడించారు.జగన్ వద్ద నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని సమర్పించాలని అన్నారు.ఒకవేళ ఆధారాలు లేకుంటే జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం హయంలో వైసీపీ నాయకులకు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే వారిని తీవ్రంగా వేధించారని ఆరోపించారు.ఇప్పటికీ ఆ బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This