Friday, September 20, 2024
spot_img

ఛత్తీస్‎గఢ్ లో మైనర్ బాలిక పై అత్యాచారం,07 మంది అరెస్ట్

Must Read

ఛత్తీస్‎గఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.జాష్‎పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక పై,ఆరు మంది మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు 01న సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన ఓ బాలిక సమీపంలోని మార్కెట్ లో ఏర్పాటు చేసిన జాతరను చూడడానికి వెళ్ళింది.రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో నిందితులు ఆ బాలికను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొని వెళ్ళి,అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు.మొత్తంగా 07 మంది నిందితులు ఈ దారుణనికి పాల్పడ్డారని,అందులో ఆరుగురి వయస్సు 16 నుండి 17 ఏళ్ల మద్య ఉందని,మరో నిందితుడి వయస్సు 18 ఏళ్లు ఉందని పోలీసులు వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This