Tuesday, September 16, 2025
spot_img

వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారు

Must Read

తాము మహబూబ్‎నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్‎నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుపడితే ఎవర్ని క్షమించమని అన్నారు.

మహబూబ్‎నగర్ జిల్లా కోసం కెసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This