Friday, October 3, 2025
spot_img

ఆకతాయిల వేదింపులకు మరో యువతి బలి

Must Read

ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది.నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంకి చెందిన కొత్త కళ్యాణి (19) జులై 06న ఇద్దరు యువకుల వేధింపులకు తట్టుకోలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణిను మిర్యాలగూడ ఆసుప్రతికు తరలించారు.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రైవేట్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కళ్యాణి మంగళవారం మృతి చెందింది.తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే తమ కూతురు చావుకు ఇద్దరు యువకులే కారణమని తల్లిదండ్రులు పేర్కొన్నారు.గత కొన్ని రోజుల నుండి ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేదిస్తున్నరని,ఆ వేదింపులకు తాళలేకనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This