Wednesday, July 30, 2025
spot_img

వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారు

Must Read

తాము మహబూబ్‎నగర్ వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం అయిన మహబూబ్‎నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సంధర్బంగా కురుమూర్తి స్వామిని దర్శించుకొని..కొండకు వెళ్ళే ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కురుమూర్తి స్వామి ఆశీర్వాదంతోనే ఈ స్థాయిలో ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుపడితే ఎవర్ని క్షమించమని అన్నారు.

మహబూబ్‎నగర్ జిల్లా కోసం కెసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వలసలను అపాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Latest News

T-Hubలో గండికోట సుబ్బారావుకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

ప్రొద్దుటూరుకు చెందిన సివిల్ ఇంజనీర్ గండికోట సుబ్బారావు, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS