Saturday, September 6, 2025
spot_img

బీఆర్ఎస్ లో అయోమయం,పార్టీకి గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

Must Read

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు కూడా హస్తం గూటికి చేరారు.మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులను,ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నారు.కానీ కేసీఆర్ చేస్తున్న కృషి ఫలించడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.త్వరలో మరికొంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This