Friday, September 20, 2024
spot_img

ఏ చెరువు ఎక్కడ కబ్జా అయిందో కేటీఆర్ కు తెలియదా..

Must Read
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను ఎక్కడెక్కడ కబ్జా చేశారో తెలియదా అని ప్రశ్నించారు.మంత్రిగా కేటీఆర్ చేసిన తప్పులు ఇంకా ఎవరు చేయలేదని,అందుకు కేటీఆర్ ను మొదట ముద్దాయిగా అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకులు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారని,చెరువుల పరిరక్షణ కోసం ఏ పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.అక్రమ కట్టడాలను కూల్చివేసి,ఏ చెరువు ఎంత కబ్జా అయిందో లెక్కలు తెలపాలని డిమాండ్ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This