Friday, September 20, 2024
spot_img

హుస్నాబాద్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళ విజయవంతం

Must Read
  • మేళకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన
  • మేళలో పాల్గొన్న 60 పైగా కంపెనీలు
  • 5225 మందికి ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీలు
  • ఉద్యోగాలు పొందిన వారికి కలెక్టర్ తో కలిసి ఆర్డర్స్ కాపీలు
    అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన వచ్చింది.జాబ్ మేళ కోసం 8795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.దాదాపు 60 కి పైగా జాతీయ , అంతర్జాతీయ కంపెనీలు సైతం మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. అవసరమైన విద్యార్హతలు,నైపుణ్యాలు కలిగిన 1,310 మంది నిరుద్యోగులకు తక్షణమే ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు పొందారు.మరో 3,887 మంది షార్ట్ లిస్ట్ తయారు చేశారు.వారిని ఆఫిస్ లలో పిలిచి స్కిల్స్ నేర్పించిన తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.సుమరుగా 5,225 మంది నిరుద్యోగులు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సంధర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలిపారు.ఉద్యోగాలు పొందిన వారికి ఆర్డర్ కాపీలను కలెక్టర్ మను చౌదరి తో కలిసి అందించారు.జాబ్ మేళ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పొందేలా చేపలు,పాల ఉత్పత్తి, ఎనిమల్ హస్బండరి అభివృద్ధి చేసి మరింత ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలని ,ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రాధాన్యత గా భావిస్తున్నామన్నారు.స్వచ్ఛంద సంస్థలు కూడా మరింత తోడ్పాటును అందించాలనీ కోరారు.ఉద్యోగాల కోసం డిమాండ్ ఎక్కువగా వచ్చిన కంపెనీలు నియోజకవర్గంలోని మండలాల వారీగా జాబ్ మేళాను నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.నర్సింగ్ ,ఫార్మసీ చదివిన వారికి అపోలో ,యశోద, కామినేని హాస్పిటల్స్ మరియు ఫార్మా కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళ నిర్వహించేలా కోరుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.జాబ్ మేళా కోసం హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కంపెనీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.హుస్నాబాద్ ప్రాంతం నుండి ఎవరు ఉద్యోగాలు కావాలని వచ్చిన వారి పట్ల సానుకూలంగా స్పందించాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు.హుస్నాబాద్ లో సెట్వీన్ లో ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత శిక్షణ తీసుకొని విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చని,ఈ ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని నియోజకవర్గ యువతకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత ,వైస్ చైర్మన్ అయిలేని అనిత ,కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,ఆర్డీవో శ్రీరామ మూర్తి ,మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మున్సిపల్ కౌన్సిలర్లు ,ఇతర అధికారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This