- కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ
మాజీ మంత్రి,భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు.సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన అయిన,రైతులకు రూ.02 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డిని సన్యాసన్న హరీష్ రావు వెధవ సన్యాసనీ ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతాని అంటున్న హరీష్రావుకి జాగా లేదా,తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు,రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ ఆస్తులు ఎంత అని హరీష్ రావుని ప్రశ్నించారు.దోచుకున్న అవినీతి సొమ్మును ఎక్కడ దాచుకోవలో తెలియక బినామీలను తయారు చేసుకున్నరని విమర్శించారు.