Friday, September 20, 2024
spot_img

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

Must Read

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.బెంగాల్ లో 4 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీంఎంసి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఇక హిమాచల్ ప్రదేశ్ లో 03 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా,మధ్యప్రదేశ్ లో 01,జార్ఖండ్ లో 02 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఇక తమిళనాడు లో 01 స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఆ ఒక్క స్థానంలో డీఎంకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి,కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This