Friday, September 20, 2024
spot_img

ఎప్పటికైనా న్యాయం,ధర్మమే గెలుస్తుంది

Must Read
  • కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా
  • న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది
  • నేను ఎలాంటి తప్పు చేయలేదు
  • నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా

ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.శంషాబాద్ విమానాశ్రయం నుండి నివాసానికి చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడుతూ,న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని అన్నారు.నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కచ్చితంగా,న్యాయమే గెలుస్తుందని వెల్లడించారు.కడిగిన ముత్యంలా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుండి బయటికి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ఈ సంధర్బంగా కవిత వ్యాఖ్యనించారు.కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పోరాటల్లో పాల్గొంటానని అన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This