Thursday, September 19, 2024
spot_img

ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చాలా నచ్చింది; డైరెక్టర్ అనిల్ రావిపూడి

Must Read

దిలీప్ ప్రకాష్,రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన,దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’.హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రకాష్ రాజ్, నాజర్,రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు.టీజర్,ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో టీం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిధిగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది.నాటకరంగం, రంగస్థలం బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. నాటకం గురించి ఈ జనరేషన్ కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది. నాటకం నుంచి చాలా గొప్ప నటులు సినిమా రంగాన్ని ఏలారు. నాటకం అమ్మలాంటింది. సినిమా ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్న బిడ్డలాంటింది. ఈ సోషల్ మీడియా జనరేషన్ లో నాటకాలు ఇంకా ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. నాటక ప్రదర్శనలు ఇంకా జరుగుతున్నాయి. నేను, రఘుబాబు అన్నయ్య చాలా నాటకపోటీలకు విశిష్ట అతిధులుగా వెళ్లి టీమ్స్ కి బ్లెస్ చేసి, బహుమతులు ఇస్తుంటాం. నాటకరంగం నుంచి ఇప్పటికీ చాలా మంది నటులు సినిమాలకి వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలా మందికి వేషాలు ఇచ్చాను. అలాంటి నాటకరంగాన్ని నేపధ్యంగా ఎంచుకొని ‘ఉత్సవం’ సినిమాని చాలా కష్టపడి చేశారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి. దర్శక నిర్మాతలకు నా స్పెషల్ విషెస్. దిలీప్ కి ఇది ఫస్ట్ ఫిల్మ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. రెజీనా మంచి రోల్స్ చేస్తుంటారు. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అనూప్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన్ని ఇంకా మంచి మంచి పాత్రల్లో మనం ఉపయోగించుకోవాలి. రాజేంద్రప్రసాద్ గారు నాకు ఇష్టమైన నటులు. ఉత్సవం పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది. ఇందులో వుండే దాదాపు అందరి నటులతో వర్క్ చేశాను. టీంలో అందరికీ నా బెస్ట్ విషెస్. ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుంటున్నాను’ అన్నారు హీరోయిన్ రెజీనా కసాండ్రా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీ అందరినీ కలవడం ఉత్సవం లా వుంది. డైరెక్టర్ అర్జున్ సాయి గారు అంకితభావంతో ఈ సినిమా చేశారు. ఇలాంటి బ్యాప్ డ్రాప్ లో లవ్ స్టొరీని చెప్పడం మామూలు విషయం కాదు. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో ఒక సోల్ వుంది. ఆ సోల్ నాటకాలు. సురబి నాటకాల వారికి అభినందనలు. డీవోపీ రసూల్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, టీం అందరికీ థాంక్ యూ.మా నిర్మాత సురేష్ పాటిల్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి’ అన్నారు. హీరో దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ.. ఉత్సవం నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాని ప్రోత్సహించడానికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. సినిమా బావుంటే కొత్తవారిని దగ్గరకి తీసుకొని ప్రోత్సహించేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో వస్తున్నాం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు లాంటి గొప్ప నటులు పని చేశారు. ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ రెజీనా. థాంక్ యూ సో మచ్. డైరెక్టర్ అర్జున్ సాయితో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాను. ఈ సినిమా ఇచ్చినందుకు థాంక్ యూ. నిర్మాత సురేష్‌ పాటిల్‌ గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాని చూసి ఫస్ట్ అప్రిషియేషన్ ఇచ్చింది శశి గారు. మైత్రీ మూవీ మేకర్స్ కి, హోంబలే, సినీ పోలిస్ వారికి థాంక్ యూ. మనసుకి చాలా దగ్గరైనా సినిమా ఇది. సెప్టెంబర్ 13న మన తెలుగు సినిమా ఉత్సవం రిలీజ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్, లవ్ కావాలి’ అన్నారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. డైరెక్టర్ అర్జున్ సాయి పట్టువదలని విక్రమార్కుడు. ఎన్నో హార్డిల్స్ ని దాటుకొని చాలా మంది నటులతో ఈ సినిమాని తీశాడు. నాటకం గురించి తనకున్న తపన అద్భుతం. అందరి నటుల నుంచి కావాల్సిన నటన రాబట్టుకున్నాడు. నిర్మాత సురేష్ ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో తీయాలి. ఈ సినిమా విజయోత్సవానికి మళ్ళీ మనమంతా కలుసుకోవాలి. సురభి నాటక మండలి వారికి ధన్యవాదాలు. నాటక రంగాన్ని బ్రతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించాను. వారిపై ఒక సినిమా తీయాలనే ఆలోచన మామూలు విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడిని అభినందిస్తున్నాను. తను మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’ అన్నారు దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ముందుగా సురభి వారికి కృతజ్ఞతలు. ఆర్ట్ కోసం జీవితాల్ని త్యాగం చేసిన దాదాపు 150 కుటుంబాలు వున్నాయి. వారి అంకిత భావం చూసి ఈ కథని రాయడం మొదలుపెట్టాను. దీనికి బ్యూటీఫుల్ లవ్ స్టొరీ యాడ్ చేశాం. హీరో, హీరోయిన్ పాత్రలు రాసినప్పుడు సాక్షాత్ శివ పార్వతులే దక్ష యజ్ఞం నాటకం వేయడానికి వచ్చారేమో అనిపించింది. కథనే ఇంత మందిని డ్రైవ్ చేసింది. ఉత్సవం చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుడి మొహంపై ఓ చిరునవ్వు వుంటుంది. నా డైరెక్షన్ టీంకి థాంక్ యూ. సెప్టెంబర్ 13న థియేటర్స్ లో సినిమా చూడండి. ఒక మంచి సినిమా చూసి ఫీలింగ్ కలుగుతుంది. అది మా గ్యారెంటీ’ అన్నారు.

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img

More Articles Like This