Friday, September 20, 2024
spot_img

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

Must Read

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో నెలకొన్న వివిధ సమస్యలను వివరించారు.ఈ సంధర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరామని తెలిపారు.హుజూరాబాద్ లో సింగాపూర్,రాంపూర్,రంగాపూర్, పెద్దపాపాయపల్లిలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్ పాస్ గురించి కూడా చర్చించమని తెలిపారు.ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన నడుస్తున్నాయని,ఈ అంశం కేంద్రమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళినట్టు ఈటెల రాజేందర్ తెలిపారు.తాము తెలిపిన సమస్యల పై కేంద్రమంత్రి సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు ఈటెల రాజేందర్ వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This