Sunday, September 7, 2025
spot_img

ప్రజల ప్రయోజనాల కోసం సేవలందించడానికి సిద్దం !

Must Read
  • డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
  • కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!

సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు పోలీసు అధికారులు డీజీపీ కి విన్నవించారు. రిటైర్డు ఐపిఎస్ భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లు శుక్రవారం డీజీపీ జితేందర్ ను కలిశారు. డీజీపీగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు సరైన సమయంలో డీజీపీ గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయనతో మాట్లాడారు. విద్యార్థులు యువత తమకు తెలియకుండానే డ్రగ్స్ బారిన పడుతున్నారని, అక్రమంగా గ‌*జాయి ను విక్రయిస్తున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. వివిధ రూపాల్లో యువతను, స్కూల్ విద్యార్థులకు సైతం డ్రగ్స్ కు అలవాటు చేస్తున్న డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని విన్నవించారు.

మరోవైపు సైబర్ కేటుగాళ్లు అన్ని వర్గాల ప్రజలను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారని, సైబర్ దొంగల బారిన పడి కష్టపడి సంపాదించి బ్యాంకులలో దాచుకున్న పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నదంతా కోల్పోయి రోడ్డున పడుతున్నారని, బ్యాంకులలో డబ్బు దాచుకుంటే సేఫ్ కాదనే అభిప్రాయం ప్రజల్లో విస్తరిస్తొందని, సైబర్ నేరాలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని వారు డీజీపీ కి విజ్ఞప్తి చేసారు.
తాము పదవీ విరమణ చేసినప్పటికీ అవసరమైనపుడు పోలీసు శాఖకు అన్ని విధాల సేవలు అందించి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజాప్రయోజనాల కోసం తమ శక్తి ఉన్నంత వరకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు డీజీపీ కి స్పష్టం చేసారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This