Wednesday, August 20, 2025
spot_img

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్ లో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

Must Read

నిర్మల్ జిల్లా దిలావర్‎పూర్‎లో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం స్థానిక మహిళాలు నిరసనలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు వెళ్ళగా, వారి వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వరు. పురుగుల మందు డబ్బలతో మహిళలు రోడ్డుపై బైఠాయించారు.ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తుంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ వచ్చేవరకు తమ నిరసన కొనసాగుతుందని, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS