Monday, August 18, 2025
spot_img

మరోసారి భద్రత బలగాల బేస్ క్యాంప్‎పై మావోయిస్టుల దాడి

Must Read

ఛత్తీస్‎గడ్‎లోని బీజాపూర్ జిల్లాలో భద్రత బలగాల బేస్ క్యాంప్‎పై మావోయిస్టులు మరోసారి దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలోని పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 02 పోలీస్ బేస్ క్యాంప్‎పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. సమీప ఆసుపత్రికి తరలించి గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ దాడుల వెనుక హిద్మా హస్తం ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజుల్లో భద్రత బలగాలపై మావోయిస్టులు దాడులు చేయడం ఇది రెండోసారి.

శుక్రవారం కూడా బీజాపూర్ జిల్లాలోని జీడిపల్లిలో భద్రత దళాల బేస్ క్యాంప్‎పై మావోలు దాడి చేశారు. అప్రమత్తమైన బలగాలు వెంటనే కౌంటర్ ఇచ్చాయి. అర్ధరాత్రి నుండి భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS