Wednesday, August 20, 2025
spot_img

ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు : ఏక్‎నాథ్ షిండే

Must Read

ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‎నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన రెండేళ్ల మహాయుతి కూటమి పాలనలో ఎన్నో పనులు చేశామని, అందుకే ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమిని గెలిపించారని తెలిపారు.

లోక్‎సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మహాయుతి కూటమికి 43.55 శాతం ఓట్లు దక్కగా, ఎంవీఏకు 43.71 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష కూటమికి 31 సీట్లు రాగా, అధికార కూటమికి 17 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు కూడా ఈవీఎంలలో స్కాం జరిగినట్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదని తెలిపారు.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS