Sunday, July 20, 2025
spot_img

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

Must Read
  • ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి

మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. మొబైల్ లకు టీవీ లకు దూరంగా ఉంటే భవిష్యత్తు కు బంగారు బాటలను వేసుకోవొచ్చని కొనియాడారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది విద్యార్థిని, విద్యార్థులు 150 మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు. సౌత్ జోన్ జాయింట్ సెక్రటరీ పసుపులేటి నరేందర్, బివిపి ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంత్ సతీష్ గౌడ్, బివిపి క్రీడా భారత్ కన్వీనర్ తెలంగాణ ప్రాంత్ లవ కుమార్ గౌడ్, ట్రప్సా మేడ్చల్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి, ట్రాప్సా ప్రెసిడెంట్ వినోద్ యాదవ్ ,సాధన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, ఎస్ కె ఎం. ఉన్నత పాఠశాల డైరెక్టర్ శృతి గౌడ్, పివి స్కూల్ కరస్పాండెంట్ నర్సింలు గౌడ్, ఏ ఎం ఎస్ స్కూల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ పాల్గొన్నారు.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS