Friday, October 3, 2025
spot_img

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

Must Read
  • నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌
  • జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం

తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. పాకా సత్యనారాయణ మాట్లాడుతూ.. ’అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఆదివారం అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. 30న ఉదయం 11 నుంచి 1 వరకూ నామినేషన్‌ స్వీకరణ పక్రియ ఉంటుంది. 30న మధ్యాహ్నం 1 నుంచి 2 వరకూ నామినేషన్ల స్కూట్రిని నిర్వహిస్తారు. సాయంత్రం 4 లోపు ఉపసంహరణకు గడువు. జూలై 1న అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుంది. జాతీయ కౌన్సిల్‌ పీసీ మోహన్‌ ఎన్నికల అబ్జర్వర్‌గా ఉంటారని చెప్పారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి, కిషన్‌ రెడ్డిలు తెలుగు రాష్ట్రాల‌కు అధ్యక్షులుగా ఉన్నారు. నోటిఫికేఏషన్‌తో భాజపా సంస్థాగత ఎన్నికల పక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ నుంచి పలువురు పోటీలో ఉన్నారు. డికె అరుణ, ఈటెల రాజేందర్‌, రఘునందన్‌ రావు, రామచంద్రరావులు ప్రధాన పోటీదారులగా ఉన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This