Friday, September 19, 2025
spot_img

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్

Must Read

కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.ఈరోజు ఉదయం సౌత్ బ్లాక్ లోని తనకు కేటాయించిన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.కేంద్ర రక్షణశాఖ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి.ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ కు అధికారులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశరక్షణే మా బాధ్యత అని అన్నారు.తన పై నమ్మకంతో మరోసారి రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.బలమైన ఆత్మనిర్భర్ భారత్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని తెలిపారు.ఇప్పటి వరకు రూ.21000 కోట్ల రూపాయలకు పైగా రక్షణ పరికరాలను ఎగుమతి చేశామని,దీనిని రూ.50,000 కోట్లకు తీసుకోని వెళ్లడమే తమ లక్ష్యమని ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This