Tuesday, July 1, 2025
spot_img

కేవ్ పబ్ లో డ్రగ్స్ కలకలం, అడ్డంగా బుక్కైన ప్రముఖులు

Must Read

హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్ డీసీపీ తెలిపారు.పబ్ ఓనర్లు పరారీలో ఉన్నారని,త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీసీపీ వెల్లడించారు.డ్రగ్స్ అమ్మిన,తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.డ్రగ్స్‌ తీసుకుంటూ చిక్కిన వారిలో ఫోటోగ్రాఫర్‌ మహేష్‌ చంద్ర,అకౌంటెంట్‌ ఆదన్‌ బారి,అమెజాన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎండీ షఫీ,సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కిరణ్‌ బగానీ,ఎవరెస్ట్‌ మసాల వ్యాపారవేత్త మనీష్‌ గిరిధర్‌,యూనిమేటర్‌ చింతం పూజిత్‌. అబ్దుల్లా ఆయుబ్‌,వ్యాపారవేత్త మమ్మద్‌ రఫీ,అవంతి డిగ్రీ కళాశాల విద్యార్ధి సాయి ప్రణీత్ ఉన్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS