Friday, July 4, 2025
spot_img

పట్టభద్రుల్లారా మ‌ల్ల‌న్న‌ను గెలిపించండి

Must Read
  • ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్

పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తుందన్నారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు నిరుద్యోగ వ్యతిరేక పార్టీలని , అందుకే కాంగ్రెస్ పార్టీను గెలిపించుకోవాలని కోరారు.అనంతరం కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ నేతలు మెడ శ్రీనివాస్, సుమన్ గౌడ్, క్రాంతి, మోతీలాల్ నాయిక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS