Thursday, July 3, 2025
spot_img

11 చోట్ల ఇండియా కూటమిదే హవా,సంబరాల్లో కార్యకర్తలు

Must Read

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.బెంగాల్ లో 4 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో టీంఎంసి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఇక హిమాచల్ ప్రదేశ్ లో 03 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా,మధ్యప్రదేశ్ లో 01,జార్ఖండ్ లో 02 స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.ఇక తమిళనాడు లో 01 స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఆ ఒక్క స్థానంలో డీఎంకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి,కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS