Thursday, July 31, 2025
spot_img

పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు

Must Read
  • ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారు
  • ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈటెల విమర్శలు

పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. అలా కల్పించివుంటే ఇవాళ నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారని అన్నారు. ఉద్యోగాలు కల్పించక పోగా ..ఇచ్చామని చెప్పడం మరింత దారుణమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని భారాస ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు.

Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS