Thursday, July 3, 2025
spot_img

లడ్డు వివాదంపై స్పందించిన జగన్

Must Read

100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని అన్నారు.ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు.రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని ఆరోపించారు.రాజకీయం కోసం భక్తుల మనోభావాలతో అడుకుంటారా అని మండిపడ్డారు.దశబ్ధలుగా జరుగుతున్న పద్దతులోనే తిరుమలలో లడ్డు తయారీ జరుగుతుందని తెలిపారు.చంద్రబాబుది 100 రోజుల పాలన కాదని,100 రోజుల మోసమని ఎద్దేవా చేశారు.తిరుమల,తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వ హయంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె,కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS