Wednesday, August 20, 2025
spot_img

వన్నాల శ్రీరాములుని పరామర్శించిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్

Must Read

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుని కేంద్రమంత్రి జార్జ్ కురియన్ పరామర్శించారు.బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జుర్జ్ కురియన్ హన్మకొండలో పర్యటించారు.అడ్వకెట్స్ కాలనీలోని వన్నాల శ్రీరాములు నివాసానికి వెళ్ళి అయినను పరామర్శించారు.జార్జ్ కురియన్‎కి డాక్టర్ వన్నాల వెంకటరమణ స్వాగతం పలికారు.ఇటీవల వన్నాల శ్రీరాములుకు అత్యాధునిక మోకాళ్ళ కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స జరుగింది.దీంతో అయిన ప్రస్తుతం నివాసం వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు.వన్నాల శ్రీరాములు జనసంఘ్ పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.విద్యార్థి దశ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)లో చురుకుగా పాల్గొన్నారు.గతంలో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయ్ కూడా వన్నాల శ్రీరాములు స్వగృహాన్ని సందర్శించారు.వన్నాల శ్రీరాములు వెంట హన్మకొండ మాజీ శాసన సభ్యులు మార్తినేని ధర్మారావు,బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ,అమరేందర్ రెడ్డి,బీజేపీ నాయకులు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములును పరామర్శించిన అనంతరం కేంద్ర మంత్రి జార్జ్ కురియన్‎ని శాలువతో సత్కరించి,మెమోంటో అందజేశారు.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS