Friday, July 4, 2025
spot_img

శ్రీ దత్త సభా మంటపాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Must Read

ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్‌ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు తెలంగాణకు విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రజలందరికీ ముఖ్యమంత్రి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైసూర్‌లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ వారు ఇక్కడ నిర్వహించడం తెలంగాణకు శుభ సూచకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,భక్తులు పాల్గొన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS