Tuesday, November 18, 2025
spot_img

గోవా పర్యటకులకు గుడ్‎న్యూస్, అందుబాటులోకి కొత్త రైలు

Must Read

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్ 10న ప్రారంభమవుతాయని వెల్లడించింది. సికింద్రాబాద్-వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి బుధ, శుక్రవారం, వాస్కోడగామా – సికింద్రాబాద్ ( 17040 ) రైలు ప్రతి గురు , శనివారం బయల్దేరుతాయని తెలిపింది.

ప్రస్తుతం రెగ్యులర్ ట్రెయిన్ సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య వారంలో నాలుగు రోజులు మాత్రమే నడుస్తోంది. రైలు ( 17063 ) మంగళ, బుధ, శుక్ర, ఆది వారాల్లో అందుబాటులో ఉంటుంది. కానీ ఈ ట్రైన్ కి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్‌ నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉంది. ఇది అదివారం రోజే నడుస్తోంది. ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మరో కొత్త రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This